Good News for Employees: కరోనా తెచ్చిన సంక్షోభం అన్నిరంగాలపై పండింది. ప్రపంచం మొత్తం ఆర్థికంగా వెనక్కి వెళ్లింది. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలపై ప్రతీశంగా తీవ్రంగా పడింది. ఇలాంటి పరిస్థితిలో ఐటీ సెక్టార్ కుదైలైంది. చాలా మంది ఉద్యోగాలు కల్పోయారు. రెండేళ్లుగా పరిస్థితి కుదుట పడుతోంది. దీంతో దేశీయ ఉద్యోగ రంగం కోటుకుంటోంది. మైఖేల్ పేజ్ ఇండియా ‘షాలరీ గైడ్ 2026’ నివేదిక ఇదే విషయం స్పష్టం చేసింది. మెరుగు పడుతున్న పరిస్థితులతో అన్ని రంగాల్లో జీతాలు సగటున 8 నుంచి 12 శాతం పెరగవచ్చని అంచనా వేసింది. ఆర్థిక పునరుద్ధరణ, కొత్త పెట్టుబడులు ఈ ట్రెండ్కు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇది ఉద్యోగార్థులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తూ, ఆర్థిక వృద్ధికి బలం చేకూరుస్తుంది.
సీఎఫ్వో, సీటీవోలకు ^పీమియం ఆఫర్లు..
ఫైనాన్షియల్ చీఫ్లు, టెక్ చీఫ్లు, ఇంజినీరింగ్ నాయకులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొత్త నైపుణ్యాలు కలిగినవారు ఉద్యోగాలు మారితే 30 శాతం వరకు అధిక వేతనాలు పొందుతున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, సస్టైనబుల్ టెక్ వంటి రంగాల్లో ఈ పాత్రలు కీలకంగా మారాయి. కంపెనీలు టాలెంట్ ఆకర్షించడానికి ఉన్నత జీతాలు, బోనస్లు ఆఫర్ చేస్తున్నాయి.
స్కిల్ అప్గ్రేడ్ కీ..
ఆర్థిక పునరుజ్జీవనం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు జీతాల పెరుగుదలకు మూలం. డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ నైపుణ్యాలు కలిగినవారికి అదనపు ప్రయోజనాలు. ఉద్యోగార్థులు స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టి, జాబ్ స్విచ్ చేస్తే ఆర్థిక లాభాలు పొందగలరు. ఈ ట్రెండ్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా మారుతుంది.
2026లో ఈ పెంపు కొనసాగితే, మధ్యస్థ ఉద్యోగాల్లో కూడా మార్పు జరుగుతుంది. కంపెనీలు రిటెన్షన్ కోసం పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పెంచుతాయి. ఉద్యోగార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే, వ్యక్తిగత ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.
