
మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి హైవే వద్ద ఆగి వున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడలోని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ప్రకాశం జిల్లాను చెందిన మల్లికార్జున్ (40), నాగేశ్వర్ రావు(44), గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్ (42) గుర్తించారు.