
రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ నిర్వహణపై హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. కరోనా మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వ తేదీ వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేసి, రూ. 37.94 కోట్ల జరిమానా విధించామన్నారు. భౌలిక దూరం పాటించనందుకు 48,643 కేసులు, లాక్ ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.