
కరోనా వైరస్ ను అంతమొందించే విషయంలో భారత్ తప్పుడు లెక్క వేయడం వల్లనే ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ అధ్యక్షుని ముఖ్య వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఇక కరోనా బెడద లేదనుకుని వ్యవస్థలన్నింటినీ తెరవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయిని సెనెట్ లోని సంబంధిత కమిటీకి మంగళవారం ఆయన చెప్పారు. పరిస్థిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదనేది భారత్ అనుభవం చెబుతోంది.