
ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15 మధ్య తమ వేదికపై నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్ బుక్ వెల్లడించింది. వీటిలో చాలా కంటెంట్లను తొలగించగా కొన్నింటిని కవర్ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదిక కంపెనీ విడుదల చేసింది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి నూతన ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.