కడప జిల్లాలో ఘెార ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించారు. కడప జాల్లా కలసపాడు మండలంలోని మామిళ్ల పల్లె శివారులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి తొమ్మిది మంది మరణించడగా సుమారు మరో పది మంది వరకు గాయపడ్డారని సమాచారం ముగ్గు రాయిని వెలికి తీసెందుకు పేలుడు నిర్వహించేందుకు జిలిటెక్ స్టిక్స్ అమర్చుతున్న క్రమంలోనే ప్రమాదవశాత్తు పేలినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి శరీర భాగాలు తునాతునకలయ్యాయి.