Eng Vs Ind 3rd Test: అండర్స్ , తెంద్కూల్కర్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, భారత్ మధ్య మూడో టెస్టు కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 251 తో రెండో రోజు బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ భోజన విరామ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసింది. తొలి సెషన్ ప్రారంభమైన కాసేపటికే స్టోక్స్ 44 పరుగులు, రూట్ 104 పరుగులు, వోక్స్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ ముగ్గురి వికెట్లూ బుమ్రానే తీయడం విశేషం.