కాంస్యపు పోరులో భారత మహిళా హాకీ జట్టు ఓటమి

కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల మధ్య జరిగిన హాకీ పోరులో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో బ్రిటన్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా బాగా పోరాడింది. మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమనంగా ఉన్నాయి. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకొని  క్వార్టర్ ముగిసే సరికి రాణి రాంపాల్ సేన వరుస గోల్స్ చేసి 3-2 తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ […]

Written By: Suresh, Updated On : August 6, 2021 8:49 am
Follow us on

కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల మధ్య జరిగిన హాకీ పోరులో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో బ్రిటన్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా బాగా పోరాడింది. మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమనంగా ఉన్నాయి. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకొని  క్వార్టర్ ముగిసే సరికి రాణి రాంపాల్ సేన వరుస గోల్స్ చేసి 3-2 తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు.