Dhurandhar 2 : దేశవ్యాప్తంగా ఇప్పుడు డైరెక్టర్ ఆదిత్య డర్ ని ప్రశంసల వర్షం తో ముంచి ఎత్తుతోంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొడుతూ 2000 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడమే టార్గెట్ గా ముందుకు దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , మరో రెండు రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతోంది. ఇంత పెద్ద హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ని కొట్టిన తర్వాత ఏ హీరో అయినా సైలెంట్ గా ఉంటాడా చెప్పండి ?, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతఙ్ఞతలు తెలియజేయడమో , లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ మునిగి తేలడం వంటివి చేస్తుంటారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటి వరకు రణవీర్ సింగ్ కనీసం చప్పుడు కూడా చేయడం లేదు.
ఇన్ స్టాగ్రామ్ లో ఆయనకు 48 మిల్లియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు, కానీ పెద్దగా యాక్టీవ్ గా ఉండదు. చివరిసారిగా ఆయన పెట్టిన పోస్ట్ ట్రైలర్ గురించి మాత్రమే. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ ఆయన ఈ సినిమా గురించి పెట్టలేదు. రణవీర్ సింగ్ అంటే సోషల్ మీడియా లో మొదటి నుండి యాక్టీవ్ గా ఉండే వ్యక్తి కాదు కాబట్టి, ఆయన ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఆయన సతీమణి దీపికా పదుకొనే మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ‘ధురంధర్’ గురించి కానీ ‘ధురంధర్ 2 ‘ గురించి కానీ ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు. ఒకపక్క ఈమె భర్త సాధించిన విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, అతని నటన గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అందుకు దీపికా పదుకొనే గర్విస్తూ ఎదో ఒక కామెంట్ చెయ్యాలి కదా, కానీ ఇప్పటి వరకు అలా చేయలేదంటే కచ్చితంగా ఈమెకు ఆ సినిమా నచ్చలేదని అర్థం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధురంధర్ సిరీస్ ని అమితంగా ఇష్టపడే ఆడియన్స్ ఎంత మంది ఉన్నారో, ఆ చిత్రాన్ని ఇష్టపడని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇందులో చూపించినవి నిజాలు కాదు, బీజేపీ కి భజన చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొందరు పెదవి విరిచారు. దీపికా పదుకొనే కూడా ఆ క్యాటగిరీ కి చెందిన వారిలో ఒకరా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
