
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,256 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,422 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 78,190 మంది డిశ్చార్జి అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44,199గా నమోదు అయ్యింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 7,02,887 ఉన్నాయి.