
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో 19,32,105కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 24 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 13,081 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 25,256 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 18,93,498 మంది రికవరీ అయ్యారు.