
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జి అయ్యారు. లాక్ డౌన్ సమయంలో కరోనా పాజిటీవిటీ రేటు చాలా తగ్గిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవిటీ రేటు 4 శాతం ఉండగా, మరణాల రేటు 0.5 శాతంగా ఉందన్నారు.