హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు

నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. మంగళవారం ఎనిమిది సింహాలనకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం  ఉందని జూ అధికారులు పేర్కొన్నారు. పార్క్ లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం […]

Written By: Suresh, Updated On : May 4, 2021 11:16 am
Follow us on

నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. మంగళవారం ఎనిమిది సింహాలనకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం  ఉందని జూ అధికారులు పేర్కొన్నారు. పార్క్ లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం నుంచి 40 ఎకరాలు ఉండగా ఇందులో 10 సవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.