
దేశంలో వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. కానీ ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం విడుదల చేసిందో అప్పటి నుంచి ఆగిపోయాయి. అయితే తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 15 పైసలు, టీటర్ డీజిల్ పై 16 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.56కి చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.99 చేరగా డీజిల్ ధర రూ. 88.05కు చేరింది.