ఏపీలో రోడ్ల పనరుద్ధరణ ప్రాజెక్టులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఇప్పటికే వెనకడుగు వేస్తుండగా తాజాగా భవన నిర్మాణాల ప్రాజెక్టుల కు బిడ్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. అమరావతిలో హైకోర్టు పక్కనే మరో భవన నిర్మాణానికి AMRDA టెండర్లు పిలవగా.. గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బిల్లులు సకాలంలో ఇస్తారో లేదోనన్న భయంతో గుత్తేదారు బిడ్లు దాఖలు చేయడానికి భయపడుతున్నారు.