ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకండా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టారు. వివిధ కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. ధర్నా చౌక్ లో పీడీఎస్ యూ, ఎస్ఏఫ్ఐ నేతలు నిరసనకు దిగారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ ప్రతినిధులు యత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.