CM KCR: ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
Written By:
, Updated On : September 1, 2021 / 03:56 PM IST

బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.