
ఏపీలో రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బీ పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, శంకర్ నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.