AP Fee Reimbursement Release: ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్( reimbursement నిధులను విడుదల చేసింది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కోరుతూ వచ్చారు. ఆ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తీపి కబురు చెప్పారు. రూ.1198 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైసిపి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉండేవి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులు విడుదల చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఒకే విద్యా సంవత్సరానికి సంబంధించి పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టిడిపి కూటమి హయాంలో రియంబర్స్మెంట్ నిధులన్నీ విడుదల కావడంతో సంతృప్తి కనిపిస్తోంది.
* గత అసెంబ్లీ సమావేశాల్లో..
గత అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. నిధులు విడుదల చేయాలని కోరారు. మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా ఫీజు రియంబర్స్మెంట్ అంశం గురించి మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టిందని చెప్పుకొచ్చారు.. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం దశలవారీగా చెల్లించడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి చేయవద్దని యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు లోకేష్. విద్యార్థులను తరగతులకు హాజరుకానివ్వకుండా చేయడం, హాల్ టికెట్లను నిలిపివేయడం, పరీక్ష హాలు లోకి అనుమతించకపోవడం వంటి ఏదైనా బలవంతపు చర్యలకు పాల్పడడం చట్టవిరుద్దమని అప్పట్లోనే మంత్రి లోకేష్ గట్టిగానే హెచ్చరికలు జారీచేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై కీలక ప్రకటన చేశారు.
* సింపుల్ గా ట్విట్టర్ ద్వారా..
అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి హడావిడి చేయలేదు.. ఇదే గత ప్రభుత్వ హయాంలో అయివుంటే పత్రికల్లో ప్రకటనలతో హోరెత్తించేది. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా దీవెన పథకంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిధులను చాలామంది కుటుంబ అవసరాల కోసం వాడుకున్నారు. కళాశాలలకు ఫీజులు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేలకోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది.
* నేరుగా కాలేజీల ఖాతాల్లో..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫోకస్ పెట్టింది. గతంలో మాదిరిగా కాకుండా.. ఆ నిధులను నేరుగా కాలేజీ ల ఖాతాల్లోకి జమ చేసేలా విధానపరమైన మార్పులు చేపట్టింది. తాజాగా విడుదల చేసిన 1200 కోట్ల రూపాయలతో పాత బకాయిలతో పాటు.. ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ చేస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి.. విద్య విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దు. పాత బకాయిలను తీర్చి.. ఇకపై సకాలంలో నిధులు అందేలా చూడడమే మా లక్ష్యం. మీరు ధైర్యంగా చదువుకోండి. మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. వైసిపి హయాంలో గాడి తప్పిన విద్యావ్యవస్థను సరిచేసే పనిలో లోకేష్ చూపుతున్న చొరవ అభినందనలు అందుకుంటోంది.