ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న సీఎం ఈరోజు మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం రేపు మధ్యాహ్నం రాష్ట్రానికి తిరిగిరానున్నారు.