
జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా, అదనపు జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఉద్దేశపూర్వకంగానే ఆటోతో ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోంది. ఈ ఘటన గురించి సుప్రీంకోర్టులో ప్రస్తావించగా, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, ఈ కేసు గురించి తమకు తెలిసిందని, తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా జడ్జి ఉత్తమ్ ఆనంత్ ను గుర్తు తెలియని ఆటో ఢీకొట్టింది. ఆయన రక్తపు మడుగులో ఉండగా, ఓ వ్యక్తి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు.