
చైనా తొండి వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఓవైపు కరోనా పై పోరాటంలో భారత్ కు సహాయ, సహకారాలు అందిస్తామని చెబుతూపే మరోవైపు భారత్ కు అక్కడి నుంచి ఆక్సిజన్ , ఔషధాలు సరఫరా కాకుండా అడ్డుపుల్ల వేసింది. చైనా ప్రభుత్వ ఆధర్యంలో నడిచే సిచువాన్ ఎయిర్ లైన్స్ సంస్థ భారత్ కు 15 రోజుల పాటు కార్గో విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.