తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహాద్వారం వద్ద మంగళవాయిద్యాల నడుమ అర్చకులు న్యాయమూర్తికి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి సన్నిధికి చేరుకొని మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం పండితులు ప్రధాన న్యాయమూర్తికి వేదాశీర్వచనం పలికారు.