కొవిడ్ వ్యాక్సిన్లను విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు రాష్ట్రాలు ఒకదానికతో ఒకటి పోటీ పడితే దేశ ప్రతిష్ట మసకబారుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల తరపున కేంద్రమే వ్యక్సిన్ల కోసం ముందుకెళ్లడం కన్నా వ్యాక్సిన్ తయారీ దేశాలను భారత్ సంప్రదిస్తే మనకు బేరమాడే శక్తి లభిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆయా దేశాలతో దౌత్య పరంగా భారత్ సంప్రదింపులు జరిపే వెసులుబాటు ఉంటుందని అన్నారు.