హైకోర్టులో అశోక్ గజపతిరాజు కు ఊరట

మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పై గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ ఛైర్మన్ ను కలిశారు. అనంతరం ఈవో […]

Written By: Suresh, Updated On : August 3, 2021 6:03 pm
Follow us on

మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్ గజపతిరాజు ప్రోద్భలంతోనే మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారని ఈవో ఫిర్యాదు మేరు నమోదైన కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పై గతనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్ ఛైర్మన్ ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.