సోనియా గాంధీని ఎదురించిన ఆ పార్టీ సీఎం

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు మరింత పెరుగుతున్నాయి. నవజోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని హెచ్చరిస్తూ ఘాటుగా లేఖ రాశారు. పంజాబ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రి అధినేతనకు లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో ఇదే మొదటిసారి. ఈ లేఖ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా […]

Written By: Suresh, Updated On : July 17, 2021 2:20 pm
Follow us on

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు మరింత పెరుగుతున్నాయి. నవజోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని హెచ్చరిస్తూ ఘాటుగా లేఖ రాశారు. పంజాబ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ ముఖ్యమంత్రి అధినేతనకు లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో ఇదే మొదటిసారి. ఈ లేఖ ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.