పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. లోక్ సభ, రాజ్యసభల్లో ఇవాళ కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సాగు చట్టాలు, స్నూపింగ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఉభయసభలను సోమవారానికి వాయిదా వేశారు. మోదీ ప్రభుత్వం చర్చలకు దూరంగా పరుగెడుతున్నట్లు విషక్షాలు లోక్ సభలో ఆరోపించాయి. మరోవైపు పన్ను చట్టాల సవరణ బిల్లును లోక్ సభ ఆమోదం తెలిపింది. పన్ను చట్టాల సవరణ బిల్లుతో తమ వాగ్దానాలను నెరవేర్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.