ఉప్పాడ సముద్ర తీరం వద్ద మత్య్యకారుల బోటు బోల్తాపడింది. వేటకు వెళ్లి చేపలతో తిరగి ఒడ్డుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాకాసి అలల తాకిడితో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మత్య్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. బోటులో ఉన్న వలలు, సామగ్రి, చేపలు సముద్రం పాలయ్యాయి. సుమారు రూ. 2 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేశారు.