ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో గత ఫిబ్రవరిలో సంభవించిన హిమపాతం తాలూకూ విషాదాన్ని పూర్తిగా మరిచిపోకముందే మరో హిమపాతం కలకలం రేపుతున్నది. భారత్ చైనా సరిహద్దుల్లోని చమోలీ జిల్లాలోనే మరోసారి భారీ హిమపాతం సంభవించింది. చమోలీ జిల్లా నీతి వ్యాలీలోని సుమ్మా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు.