యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో భాగం మ్యాచ్ లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అందరూ కాకపోయినా ఎక్కువమంది అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దేశానికి ఆడడమే తమ తొలి ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఐపీఎల్ అంటూ ఆసీస్ వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనని చాలాకాలం క్రితమే ప్రకటించిన పాట్ కమిక్స్ వంటి వారిని మినహాయిస్తే చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడనున్నట్లు సమాచారం.