సెటిలర్స్ అంతా మావాళ్లే.. శ్రీనివాస్ గౌడ్

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా బేసిన్ లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. జలవిదాల నేపథ్యంలో హైదరాబాదలో ఉన్న సెటిలర్స్ ను ఇబ్బందులకు గురి […]

Written By: Suresh, Updated On : July 2, 2021 3:14 pm
Follow us on

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కృష్ణా బేసిన్ లో అవసరాలు తీరకుండానే పెన్నాకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. జలవిదాల నేపథ్యంలో హైదరాబాదలో ఉన్న సెటిలర్స్ ను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని కొంత మంది నేతలు మాట్లాడుతున్నారు. వారంతా తెలంగాణకు చెందినవారే అని తెలిపారు. ఉద్యమ సమయంలో కూడా సెటిలర్స్ అనే పదాన్ని మేం వాడలేదు అని తెలిపారు.