ఏపీలో గత 24గంటల్లో 71,806కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 6,133కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్టంలో గడిచిన 24గంటల్లో 7,075మంది కోలుకున్నారని తెలిపింది. రాష్టంలో ఒక్క రోజులో 48మంది మృతి చెందినట్లు తెలిపింది. రాష్టంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,828గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య58,445. దీనితో ఇప్పటివరకు రాష్టంలో వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,93,484 గా నమోదు కాగా, ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా 58,06,558కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.