ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68829 టెస్టులు చేయగా దాదాపు 7వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 639302కు చేరింది. ఇక మంగళవారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 51గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5461కు చేరింది.