చమురు కంపెనీలు మరోసారి వాహనదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల విరామం అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి. ఇంధన ధరలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరగా తాజాగా పెట్రోల్ పై లీటర్ కు 19 పైసలు, డీజిల్ పై 30 పైసల వరకు పెంచాయి. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.04, డీజిల్ రూ.83.80 కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబై లో లీటర్ ధర రూ 99.32, డీజిల్ రూ. 91.01 కు పెరిగాయి. హైదరాబాద్ లో రూ. 96.70, డీజిల్ రూ. 91.36 కు చేరాయి.