మరో బీజేపీ నేతపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి..

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో మరో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల బీహార్‌లో బీజేపీ నేత హత్య ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కోల్‌కతాలో బీజేపీ నేత కాల్పులకు గురి కావడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని టిటాగర్‌ మునిసిపాలిటీ కౌన్సిలర్‌ మనీష్‌ శుక్షా ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్షాపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెంఆరు. శుక్షాతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో కార్యకర్తలు ఆందోళనకు […]

Written By: NARESH, Updated On : October 5, 2020 8:56 am
Follow us on

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో మరో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల బీహార్‌లో బీజేపీ నేత హత్య ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కోల్‌కతాలో బీజేపీ నేత కాల్పులకు గురి కావడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలోని టిటాగర్‌ మునిసిపాలిటీ కౌన్సిలర్‌ మనీష్‌ శుక్షా ఆదివారం రాత్రి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్షాపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెంఆరు. శుక్షాతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారి మనోజ్‌ వర్మ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. ఇదిలా ఉండగా 12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. కాగా హత్య చేయబడ్డ శుక్లా బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్‌కు ముఖ్య అనుచరుడు.