రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట దక్కింది. రైతులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.