
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ భూములు వేలంపై ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేసింది. భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదు. ఎవరైనా ఒక బిడ్ ను ప్రభావితం చేస్తారనేది అపోహే. ఆన్ లైన్ లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించాం. ఆరోపణలపై పరువు నష్టం చర్యలు తీసుకుంటాం అని పేర్కొంది.