అక్కినేని అఖిల్ లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చి , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకొని వెళ్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 44 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. వీకెండ్ తర్వాత మొదటి సోమవారం డిస్టింక్షన్ లో పాస్ అయిన ఈ చిత్రం , నేడు కూడా అనేక థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు , లాంగ్ రన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.
ఇకపోతే విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని జీ 5 సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఒకవేళ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే , ముందు ఒప్పుకున్నా రేట్ కంటే 3 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని ఓటీటీ సంస్థ మేకర్స్ తో ఒప్పందం చేసుకుంది. కానీ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అందుకు మేకర్స్ కూడా ఒప్పుకోవడం తో , ఈ చిత్రం ఆగష్టు 8 న జీ5 యాప్ లో తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ సినిమాకు మూడు , నాలుగు వారాలు గడిచిన తర్వాత కూడా సాలిడ్ థియేట్రికల్ రన్ ఉంటే మాత్రం , ఓటీటీ విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి.
మరోపక్క మేకర్స్ ఈ సినిమాని విడుదలకు ముందు ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారో , విడుదల తర్వాత కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ ఇంటర్వ్యూస్ తో పాటు , టీవీ లో ప్రసారమయ్యే పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొంటూ , ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. అయితే మేకర్స్ వేయిస్తున్న కలెక్షన్స్ పోస్టర్స్ పైన మాత్రం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మూడు రోజుల్లో కనీసం 40 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టని ఈ చిత్రానికి , ఏకంగా 61 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ గ్రాస్ వసూళ్లు మొదటి వారం లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా ఆడుతోంది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ నిర్మాతల అత్యుత్సాహం కారణంగా ట్రోలింగ్స్ కి గురి అవుతోంది ఈ చిత్రం.
