
అరబిందో, హెటిరో భూ కేటాయింపులపై ఈడీ కేసు విచారణలో తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతించాలన్న సీఎం జగన్ పిటిషన్ పై విచారణ జూలై 2కి వాయిదా పడింది. జగన్ తరఫు వాదనల కోసం సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై ఈడీ కేసుల విచారణ ఇవాళ జరిగింది. ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. విజయసాయి రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ, ఈడీ కోర్టు విచారణను జూలై 2కి వాయిదా వేసింది.