ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్ లోని కావినగర్ పారిశ్రామిక పార్కులో ఉన్న ఓ కర్టన్ల తయారీ పరిశ్రమలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించాయి. అనంతరం సమీపంలోకి కంపెనీలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం పది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పడానకి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయ.