
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 94,189 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,80,834కి చేరింది. తాజాగా మరో 15 మంది మహమ్మారికి బలవ్వగా మొత్తం మృతుల సంఖ్య 3,296 కి పెరిగింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,308 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33,450 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది.