
కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్ కోసం డీఆర్డీవో నుంచి తమకు అనుమతి లభించినట్లు మ్యాన్ కైండ్ ఫార్మా వెల్లడిచింది. గ్వాలియర్ లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ ( డీఆర్డీవోఈ) ఈ ఔషధాన్ని తయారు చేసింది. దేశంలో కరోనా బారినపడిన రోగులకు విస్తృతంగా ఈ ఔషధాన్ని చేరవేయాలన్న లక్ష్యంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.