
తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ కు మనవి చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన కేసీఆర్ కు కూడా ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని నారాయణస్వామి తెలిపారు.