పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా లో 1600 మంది కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ సరుకుల పంపిణీకి సాయం చేసిన అక్షయపాత్ర ఫౌండేషన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ సేవ గొప్పదని అని అన్నారు. కార్మికుల కోసం స్టోర్ ఏర్పాటు చేస్తామని 30 శాతం రాయితీతో సరుకులు అందిస్తామని తెలిపారు.