Homeఉద్యోగాలుTS TET 2024: టెట్ ను అసలు పట్టించుకునే వారే లేరుగా.. ఎందుకిలా?

TS TET 2024: టెట్ ను అసలు పట్టించుకునే వారే లేరుగా.. ఎందుకిలా?

TS TET 2024: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు దరఖాస్తులు గణనీయంగా తగ్గాయి. వచ్చేనెల 20 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు దరఖాస్తు గడువు ఏప్రిల్‌ 10తో మిగియనుండగా, 9వ తేదీ నాటికి కేవలం 1.93 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బుధవారం సాయంత్రం వరకు గడువు ఉంది. 2 లక్షలు మించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతేడాది సెప్టెంబర్‌లోనిర్వహించిన ఈ పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే 90 వేల దరఖాస్తులు తగ్గే అవకాశం ఉంది.

గడువు పెంపు..
దరఖాస్తులు తక్కువగా రావడంతో విద్యాశాఖ అధికారులు గడువును మరో పది రోజులు పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏప్రిల్‌ 10(బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 20వ∙తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయినా గతేడాదిలా దరఖాస్తులు రావడం కష్టమే అని పలువురు పేర్కొంటున్నారు.

2012 నుంచి టెట్‌..
ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్షను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన టెట్‌ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015 నుంచి నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2.50 లక్షల మంది టెట్‌ అర్హత సాధించారు. ఉపాధ్యాయ కొలువు ఎంపికలకు నిర్వహించే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో కొత్తగా డీఈడీ, బీఈడీ చేసిన వారు, గతంలో టెట్‌లో తక్కువ మార్కులు వచ్చిన వారు మార్కులు పెంచుకునేందుకు టెట్‌ రాస్తున్నారు. ఈసారి మాత్రం అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోయింది.

అధిక ఫీజు..
టెట్‌ దరఖాస్తులు తగ్గడానికి అధిక ఫీజు కూడా కారణమని తెలుస్తోంది. గతేడాది వరకు టెట్‌కు రూ.400 మాత్రమే దరఖాస్తు ఫీజు ఉండేది. ఈసారి ఒక్కో పేపర్‌కు రూ.1000 వసూలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

ఎక్కువగా వస్తాయనుకుంటే..
వాస్తవానికి ఈసారి టెట్‌కు దరఖాస్తులు ఎక్కువగా వస్తాయని ఆశించారు. సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా టెట్‌ రాయాల్సిందే అని కోర్టు తీర్పు చెప్పింది. టెట్‌ ఉన్నవారికే ప్రమోషన్లు ఇవ్వాలని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ రాసే వారితోపాటు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేశారు. కానీ, గతేడాదికంటే దరఖాస్తులు తగ్గడం గమనార్హం. ఉపాధ్యాయుల తమకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

డీఎస్సీపైనే దృష్టి..
ఇక అభ్యర్థులు ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ తరుణంలో టెట్‌కు ప్రిపేర్‌ కావడం కన్నా.. డీఎస్సీకి చదవడమే మేలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో టెట్‌కు చాలా మంది దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper