‘కరోనాతో ఎవరు చనిపోతారా..’ అని చూస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ ని కరోనా రక్కసి అతలాకుతలం చేస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేతల పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.కరోనా వచ్చి ‘ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా చూస్తోందని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. విశాఖ జిల్లా లో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 5:13 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ని కరోనా రక్కసి అతలాకుతలం చేస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నేతల పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.కరోనా వచ్చి ‘ఎవరు చనిపోతారా అని గోతి కాడ నక్కలాగా ఎదురు చూస్తోంది ఎల్లో మీడియా చూస్తోందని విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. విశాఖ జిల్లా లో వృద్ధురాలు అనారోగ్యంతో మరణిస్తే రేషన్ కోసం నిల్చుని చనిపోయిందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. కరోనా అదుపులో ఉన్నందుకు ఇప్పటికే కుళ్లికుళ్లి ఏడుస్తున్న వారు డెడ్ బాడీని చూసి సంబరపడుతున్నారు’ అని ట్విట్టర్‌లో ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేశారు.

టీడీపీ నేతలు చేస్తున్న ప్రతీ ఆరోపణకు ట్విట్టర్‌ లో ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి. టీడీపీ చేస్తున్న ట్వీట్లకు కూడా ఆయన సమాధనం ఇస్తున్నారు. ఆర్టీజీ సేవల్ని వాడుకోవట్లేదన్న టీడీపీకి కూడా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగానే సమాధానం ఇచ్చారు.

ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాపిస్తున్నా ఏపీలో అధికార , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు మాత్రం ఆగడం లేదు.