కోర్టు తీర్పులు బాబుకు ముందే తెలుస్తున్నాయి.. ఎలా?

హైకోర్టులో ఇచ్చే తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు కాల్ లిస్ట్ బైట పెట్టాలని డిమాండ్ చేశారు. చిల్లరి రాజకీయాలు మానుకోవాలని బాబుకు హితవు పలికారు. వైసీపీ నాయకులు ప్రజల వెంట తిరుగుతున్నామని, టీడీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దళిత కార్డు వాడి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని విమర్శించారు. గతంలో సిఎంగా చంద్రబాబు సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో ఎలా […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 7:52 pm
Follow us on


హైకోర్టులో ఇచ్చే తీర్పులు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబు కాల్ లిస్ట్ బైట పెట్టాలని డిమాండ్ చేశారు. చిల్లరి రాజకీయాలు మానుకోవాలని బాబుకు హితవు పలికారు. వైసీపీ నాయకులు ప్రజల వెంట తిరుగుతున్నామని, టీడీపీ నాయకులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. దళిత కార్డు వాడి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బురద జల్లుతున్నారని విమర్శించారు. గతంలో సిఎంగా చంద్రబాబు సీబీఐని రాష్ట్రానికి రావద్దని జీవో ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఊసరవెల్లిలా రంగులు మార్చి మాట్లాడుతున్నారని చెప్పారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వంకు చెంప పెట్టు, షాక్ అని టీడీపీ పెంపుడు మీడియా వార్తలు రాస్తున్నాయని తెలిపారు. షాక్, చెంప పెట్టు తగిలితే టీడీపీకి తగులుతుందని చెప్పారు. 23 సీట్లు వచ్చిన టీడీపీకే చెంప పెట్టు లాంటి పదాలు బాగా సూట్ అవుతాయని అన్నారు. డాక్టర్ సుధాకర్ ఒక విఐపి కాదు, పది మందికి తెలిసిన వాడు కాదని, సీఎంను ఇష్టానుసారంగా దూషించాడని చెప్పారు. సైకోలా సుధాకర్ వ్యవహరించాడని తెలిపారు. బాబు డైరెక్షన్ లోనే సుధాకర్ సైకో లా వ్యవహరించాడన్నారు. ఇలాంటి వేషాలు ఇంకా ఎంతో మందితో వెయిస్తాడని ప్రశ్నించారు. ఆయనకు ఇలాంటి విద్యలు కొత్తకాదన్నారు. పోలీసులు సుధాకర్ అరెస్టు కు బలమైన సాక్ష్యాధారాలు సీన్ లో కనిపిస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు దళితులను వాడుకోవడం మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పారు. దళితులో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఈ మాటలను దళితులు మర్చిపోలేదని చెప్పారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసిన వ్యక్తి అన్నారు. దళితులు శుభ్రంగా ఉండరని, చదువుకోరని టీడీపీ నేతలు హేళన చేశారని తెలిపారు. బాబు జీవితమంతా స్టేలు మాయమన్నారు. సుధాకర్ వ్యవహారంలో పోలీసులు ఓపికకు దండం పెట్టాలని చెప్పారు. కోర్ట్ లను, లాయర్లను ప్రతిపక్ష నేత మేనేజ్ చేస్తున్నాడని, ఆయన బతుకు అంతా మేనేజ్మెంట్ మయమని అన్నారు. సీబీఐ విచారణ జరిగితేనే తాము కోరుకుంటున్నామని, దీంతో అన్ని వాస్తవాలు బైటకు వస్తాయని తెలిపారు. సుధాకర్ వ్యవహారంలో నిజనిర్ధారణ జరగాలన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలని బాబు కంకణం కట్టుకున్నారని తెలిపారు. పేద వాడికి అవసరమైన ఇంగ్లీషు మీడియంపై స్టే తెచ్చారని, సుధాకర్ వీడియోలను అవసరం మేరకు కట్ చేసి టీడీపీ ఛానెల్స్ ప్రచారం చేస్తున్నాయని తెలిపారు.