
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని వైసీపీ నాయకుడు ఇంట్లో అధికారులు భారీగా మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గిద్దలూరు మండలం గండికోటలో ఎక్సైజ్ ఎన్ ఫోర్న్ మెంట్ సోదాలు నిర్వహించారు. గడికోట వైసీపీ ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్ ఇంట్లో భారీగా మద్యం సీసాలు లభించాయి. ఈ ఘటనలో అధికారులు 1200 మద్యం సీసాలు స్వాధీనం, కారు సీజ్ చేశారు.’
ఇటీవల గడికోట ఎంపీటీసీగా శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం . పలుచోట్ల మద్యం భారీగా నిల్వలు ఉన్నాయనే సమాచారంతో దాడులు చేసినట్లు అసిస్టెంట్ కమిషన్ శ్రీనివాస్ తెలిపారు.