spot_img
Homeజాతీయ వార్తలుTelangana: తెలంగాణలో మొదలైన ‘యాగం ఫీవర్’.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీ?

Telangana: తెలంగాణలో మొదలైన ‘యాగం ఫీవర్’.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీ?

Telangana: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ వాతావరణం పెరుగుతోంది. దీనికి గాను అన్ని మార్గాల్లో కూా ఇరు పార్టీలు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ యాగాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. దీంతో రాష్ర్టంలో హోమాలు, యాగాలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. రాజకీయంగా ఎదిగేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్టంలో దూసుకుపోతుండటంతో దాన్ని ఎలాగైనా కట్టడి చేయాలని భావిస్తోంది. దీనికి గాను ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంభించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Telangana
Telangana

రాష్ర్టంలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యతిరేకత కూడా అలాగే ఎక్కువవుతోంది. అందుకే బీజేపీని ఎదర్కొనేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో యాగం చేయాలని భావించింది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామిని కలిచి చర్చలు జరిపారు. యాగం నిర్వహించే కార్యాచరణ ప్రణాళికపై మాట్లాడారు.

యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా మార్చిలో సుదర్శన యాగం నిర్వహించాలని సంకల్పించారు. దీనికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేతులు కలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలు చండీయాగాలు నిర్వహించారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లో కలిగిన భక్తిభావంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

Also Read: తెలంగాణలో కరోనా మరణాలపై రహస్యమిదీ?

ఈ నేపథ్యంలో బీజేపీ హిందూత్వ నినాదంతో ఓట్లు రాబట్టుకుంటోందని భావించిన టీఆర్ఎస్ తన పంథా మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో వారి రూట్లోనే వెళ్లి బీజేపీని దెబ్బతీయాలని చూస్తోంది. దీని కోసమే యాగాల నిర్వహణకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మృత్యుంజయ హోమాలు నిర్వహించాలని భావిస్తోంది. దీని కోసం ఏర్పాట్లు చేస్తోంది.

పంజాబ్ లో పీఎం కాన్వాయ్ ని రైతులు అడ్డుకున్న సందర్భంలో ఆయనకు మంచి జరగాలని కోరుతూ ఈ యాగాలు చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి రాష్ర్టంలో యాగాల నిర్వహణకు రెండు పార్టీలు సంకల్పించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. తెలంగాణలో భక్తి పారవంశ్యంతో రెండు పార్టీలు యాగాలు నిర్వహించడంతో భక్తి భావం పెరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకుల దండయాత్రకు అసలు కారణం అదే?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper