అశోక్ గజపతిని ‘ఆడవాళ్ల’తో కొట్టిస్తారా ఏంటి?

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో తెలిసిన వాళ్లే ఈ వైసీపీ వాళ్లు’ అని ఇప్పుడు ఏపీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పూసపాటి విజయనగరం రాజుల సంస్థానం అయిన ‘మాన్సాస్ ట్రస్ట్’ను చేజిక్కించుకొని సంచయిత చేతిలో పెట్టింది. టీడీపీ కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను సాగనంపింది. అయితే ఆయన న్యాయస్తానాల గడపతొక్కి మళ్లీ పదవిని అలంకరించుకున్నాడు. ఇప్పుడు వైసీపీ నైతికంగా ఈ విషయంలో ఓడగా.. టీడీపీ గెలిచేసింది. అయితే అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు […]

Written By: NARESH, Updated On : July 1, 2021 11:52 am
Follow us on

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ కొట్టాలో తెలిసిన వాళ్లే ఈ వైసీపీ వాళ్లు’ అని ఇప్పుడు ఏపీలో గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం పూసపాటి విజయనగరం రాజుల సంస్థానం అయిన ‘మాన్సాస్ ట్రస్ట్’ను చేజిక్కించుకొని సంచయిత చేతిలో పెట్టింది. టీడీపీ కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ను సాగనంపింది.

అయితే ఆయన న్యాయస్తానాల గడపతొక్కి మళ్లీ పదవిని అలంకరించుకున్నాడు. ఇప్పుడు వైసీపీ నైతికంగా ఈ విషయంలో ఓడగా.. టీడీపీ గెలిచేసింది. అయితే అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోనే మకాం వేసిన విజయసాయిరెడ్డి ఇష్టారీతిన విమర్శల వాన కురిపిస్తున్నారు.

మాన్సాస్ సహా అశోక్ గజపతిరాజు అక్రమాలపై ఆరు విచారణ కమిటీలు వేసి ఇప్పుడు నిగ్గుతేల్చే పనిలో వైసీపీ ప్రభుత్వం బిజీగా ఉంది. తమను ఎదురించి మాన్సాస్ ట్రస్ట్ ను దేవాలయాలను దక్కించుకున్న అశోక్ గజపతిరాజుపై తాజాగా ‘మహిళల’ను రంగంలోకి దింపారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా ఇప్పుడు రాజకీయం మొదలుపెట్టారన్న ప్రచారం సాగుతోంది. ఆమె విశాఖలో దిగి సంచయితను పరామర్శించారు. మహిళను తొక్కేసారని విమర్శించారు. కొత్త పాయింట్ ను కనిపెట్టారు. మాన్సాస్ ట్రస్ట్ రాజ్యాంగంలో పురుషులకు మాత్రమే చైర్మన్ పదవి దక్కాలని ఉందని..ఇది సరికాదని ఆరాజ్యాంగం మార్చాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు ఇస్తున్నారని.. మాన్సస్ ట్రస్ట్ మాత్రం ఇలా మహిళలపట్ల వివక్ష చూపిస్తున్నారని.. దీన్ని మార్చాలని వాసిరెడ్డి పద్మ కోరారు. దీంతో అశోక్ గజపతిరాజుపై ‘మహిళా అస్త్రాలు’ ప్రయోగించి ఆయనను ఇరుకునపెట్టడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.